కవచాలుగా మదరసా విద్యార్ధులు! పాక్ మరో దుష్ట పన్నాగం!
Sat May 10, 2025 16:10 India
పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు వరుస షాకులు తగలుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశం యుద్దాన్ని తట్టుకోలేని పరిస్ధితి ఉండటం, భారత్ తో పోలిస్తే పరిమిత సైన్యం, ఆయుధాలు మాత్రమే ఉండటంతో యుద్దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక అపోసోపాలు పడుతోంది. ఇదే క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వంలో మంత్రులు రోజుకో రెచ్చగొట్టే ప్రకటన చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ రక్షణమంత్రి చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.
భారత్ తో యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సైన్యం సరిపోదన్న అంచనాల మధ్య ఇవాళ పాకిస్తాన్ పార్లమెంట్ లో స్పందించిన రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ మదరసా విద్యార్ధుల్ని సైతం తమ రెండో రక్షణ కవచంగా వాడుతామని ప్రకటించారు. వారిని రెండో రక్షణ శ్రేణిగా ఆయన అభివర్ణించారు. సరిహద్దు శత్రుత్వాలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: వారికి ప్రతి నెలా రూ. 5000.. ఇంటి వద్దకే..! పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం!
మదర్సాలు లేదా మదర్సా విద్యార్థుల విషయానికొస్తే, వారు మా రెండవ రక్షణ శ్రేణి అనడంలో ఎటువంటి సందేహం లేదని రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. సమయం వచ్చినప్పుడు, అక్కడ చదువుతున్న యువకులను అవసరమైన విధంగా 100 శాతం ఉపయోగిస్తారన్నారు. తద్వారా సైన్యం భారత దాడుల్ని పూర్తిగా ఎదుర్కొనే పరిస్ధితుల్లో లేదని ఆయన చెప్పకనే చెప్పేశారు.
ఇప్పటికే పాకిస్తాన్ తమ పౌర విమానాల్ని కవచాలుగా వాడుకుంటూ భారత దాడుల్ని తప్పించుకునేందుకు చూస్తుందని మన విదేశాంగశాఖ తాజాగా వెల్లడించింది. ఇప్పుడు మదరసా విద్యార్ధుల్ని సైతం ఇలా కవచాలుగా వాడుకోవాలన్న పాక్ పన్నాగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: కేంద్రం కీలక నిర్ణయం! అప్పటివరకు ఇక విమానాలు రద్దు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!
అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడు, వీడు అంటూ అధికారిపై మండిపాటు!
3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్లైన్స్ సూచన!
యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్!
ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..
జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!
తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!
అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..
పాక్కు యూకే షాక్.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...
ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#Andhrapravasi #PakistanConspiracy #HumanShields #MadarsaStudents #ExposePakistan #TerrorTactics #ChildAbuseInTerror #StopTerrorism
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.